'రాజధానికి మద్దతుగా భారీ సభను ఏర్పాటు చేస్తాం' | ke krishna murty comments | Sakshi
Sakshi News home page

'రాజధానికి మద్దతుగా భారీ సభను ఏర్పాటు చేస్తాం'

Dec 30 2014 1:53 PM | Updated on Sep 2 2017 6:59 PM

'రాజధానికి మద్దతుగా భారీ సభను ఏర్పాటు చేస్తాం'

'రాజధానికి మద్దతుగా భారీ సభను ఏర్పాటు చేస్తాం'

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తనదైన శైలిలో స్పందించారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తనదైన శైలిలో స్పందించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20 లోగా  రాజధానికి మద్దతుగా లక్ష మందితో విజయవాడలో సభ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో విధ్వంసాన్ని డిప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు.

 

ఆ సంఘటనకు సంబంధించి ఎవరినీ ఉపేక్షించమన్నారు. గ్రామ కంటం భూములు, ఫోరం బోకు భూములు ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. వీఆర్వోవోల సంఖ్యను పెంచి సమర్ధవంతంగా పనిచేయిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement