టవేరాను ఢీకొన్న కావేరీ ట్రావెట్స్ బస్సు, ఒకరు మృతి | Kaveri travels bus hits Travera; 1 dies, 5 injured in Khammam district | Sakshi
Sakshi News home page

టవేరాను ఢీకొన్న కావేరీ ట్రావెట్స్ బస్సు, ఒకరు మృతి

Dec 17 2013 8:52 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతాండ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగాన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతాండ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కావేరి ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే  ఫ్రెండ్‌కు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. హైదరాబాద్‌కు హుషారుగా బయల్దేరిన మిత్రబృందం అనూహ్యరీతిలో ప్రమాదానికి గురైంది.

 హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టవేరాలు అనూహ్యరీతిలో ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి కుమ్మరికుంట్ల సాయి మృతిచెందగా ... షరీఫ్, సాయికృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీఏ విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండడంతో  సరైన డాక్యుమెంట్లు లేకపోవటంతో కావేరీ ట్రావెల్స్ బస్సు  విజయవాడ మీదుగా వెళ్లాల్సింది... ఖమ్మం మీదుగా పయనమైంది. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement