పాత్రికేయుల హెల్త్‌పాలసీ పొడిగింపు | journalist health policy extended to next year | Sakshi
Sakshi News home page

పాత్రికేయుల హెల్త్‌పాలసీ పొడిగింపు

Mar 28 2017 7:40 PM | Updated on Sep 5 2017 7:20 AM

రాష్ట్రంలో పాత్రికేయులకు ఇచ్చే ఆరోగ్య పథకం మరో ఏడాది (2017-18) కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి: రాష్ట్రంలో పాత్రికేయులకు ఇచ్చే ఆరోగ్య పథకం మరో ఏడాది (2017-18) కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సమాచార ప్రజా సంబంధాల కమిషనర్‌ ఇచ్చిన వినతి మేరకు జర్నలిస్టులకు వర్తించే హెల్త్‌ స్కీమును ఏడాది పొడిగించామని, ఈమేరకు ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ సీఈఓ చర్యలు తీసుకోవాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement