
అమరావతి బ్యూరో : నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) మహాసభల్లో పాల్గొనాల ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం నిడమోలు వద్ద పాదయాత్ర సాగిస్తున్న జగన్ను నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ గంగసానిరెడ్డి కలిశారు. నాటా మహాసభల ఆహ్వాన లేఖను ఆయనకు అందజేసి.. సభల్లో పాల్గొనాలని కోరారు. మహాసభలు జూలై 6 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయి.