రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో తనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించేందుకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు.
మంథని, న్యూస్లైన్: రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో తనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించేందుకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తనను పీసీసీ, తెలంగాణ సీఎం పదవులు వరించనున్నాయనేది ఊహాగానాలు మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకన్నా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారని, ఆ పదవులు వారికే ఇవ్వాలని అన్నారు. తాను పౌరసరఫరాల శాఖకు సంబంధించిన విషయంలోనే శుక్రవారం ఢిల్లీ వెళ్లానని, పార్టీ నుంచి పిలుపు రాలేదని స్పష్టంచేశారు.