భార్య తిట్టిందని.. | husband commits suicide due to family problems in nellore district | Sakshi
Sakshi News home page

భార్య తిట్టిందని..

Mar 10 2016 12:17 PM | Updated on Sep 3 2017 7:26 PM

భార్య తిట్టిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

దొరవారిసత్రం: భార్య తిట్టిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మీజూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మునిరామయ్య(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మునిరామయ్యను మద్యం మానేయమని భార్య పలుమార్లు చెప్పింది. బుధవారం రాత్రి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మునిరామయ్య ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు.  విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement