తిరుమలకు పోటెత్తిన భక్తులు | heavy queue line with devotees at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Jun 10 2017 8:04 AM | Updated on Aug 25 2018 7:11 PM

తిరుమలకు పోటెత్తిన భక్తులు - Sakshi

తిరుమలకు పోటెత్తిన భక్తులు

చిత్తూరు జిల్లా తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి బయట ఓ కిలోమీటర్‌ మేర భక్తులు బారులుతీరారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యే ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 81,347 మంది భక్తులు దర్శించుకోగా స్వామివారి హుండీకి రూ. 2.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement