ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై గవర్నర్ మండిపాటు | Governor compliant to ttd chairman against Sri Venkateswara Bhakti Channel | Sakshi
Sakshi News home page

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై గవర్నర్ మండిపాటు

Jan 3 2014 1:33 PM | Updated on Aug 25 2018 7:16 PM

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై గవర్నర్ మండిపాటు - Sakshi

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై గవర్నర్ మండిపాటు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మండిపడ్డారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మండిపడ్డారు. ఆ చానల్ నిర్వహణ తీరుపై టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సర వేడుకలు, పండగ, పర్వదినాలు, సెలవు దినాలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉండటం సహజమేనని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ వివరణ ఇచ్చారు.

 

నిన్న ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలిపై ఓ పోలీసు వాకిటాకీతో దాడి చేసింది. దాంతో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వివరణ ఇచ్చారు. అయితే నూతన సంవత్సరం సందర్బంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీ పాస్ల మంజూరులో పూర్తి పారదర్శకత పాటించామని గోపాల్ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement