చిత్తూరు(టౌన్), న్యూస్లైన్: క్రీడల్లో దేశానికి మంచి పేరు తేవాలని చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు క్రీడాకారులకు సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్వంలో చిత్తూరులోని మెసానికల్ క్రీడా మైదానంలో 59వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-14, 17 బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్-2013 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. క్రీడలను ఎమ్మెల్యే సీకే బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు చిత్తూరు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. డీఈవో ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో పతకం సాధించిన విషయం గుర్తుచేశారు. శుక్ర, శనివారాల్లో పోటీలు జరుగుతాయన్నారు. చిత్తూరు డీఎస్పీ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, డీఈవో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో సయ్యద్, చిత్తూరు డీవైఈవో చిట్టిబాబు, కడప ఆర్ఐపీ (రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) భానుమూర్తి, రాష్ట్ర పర్యవేక్షకులు రాఘవరెడ్డి, జిలానీబాషా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రవీంద్రారెడ్డి, రెండో పట్టణ సీఐ సుధాకర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రౌండ్లోకి పలు జట్లు
బ్యాడ్మింటన్ పోటీలు గురువారం మధ్యాహ్నం హోరాహోరీగా సాగాయి. అండర్-14 బాలుర విభాగంలో ప్రకాశంపై వెస్ట్ గోదావరి, కరీంనగర్పై కర్నూలు, నల్గొండపై వరంగల్, నెల్లూరుపై చిత్తూరు, ఆదిలాబాద్పై గుంటూరు, కృష్ణాపై హైదరాబాద్ జట్లు విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించాయి. అలాగే బాలికల విభాగంలో శ్రీకాకుళంపై చిత్తూరు, వరంగల్పై హైదరాబాద్, ఆదిలాబాద్పై హైదరాబాద్, కరీంనగర్పై కృష్ణా, నెల్లూరుపై నిజామాబాద్, వెస్ట్ గోదావరిపై కడప జట్లు గెలు పొందాయి. అండర్-17 బాలుర విభాగంలో నిజామాబాద్పై ప్రకాశం, గుంటూరుపై వరంగల్, ఆదిలాబాద్పై కడప, మెదక్పై కృష్ణా, మహబూబ్నగర్పై వైజాగ్, కరీంనగర్పై శ్రీకాకుళం, బాలికల విభాగంలో శ్రీకాకుళంపై విజయనగరం, ఆదిలాబాద్పై కరీంనగర్, ఈస్ట్ గోదావరిపై రంగారెడ్డి, నల్గొండపై వెస్ట్ గోదావరి, కడపపై వైజాగ్ జట్లు గెలుపొందాయి.
క్రీడల్లో దేశానికి పేరుతేవాలి
Published Fri, Dec 27 2013 4:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement