కార్తీకదీపాల కోసం వెళ్లి.. | Four drowned in seperate incidents in krishna and guntur | Sakshi
Sakshi News home page

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విషాదం

Nov 19 2017 10:02 AM | Updated on Aug 24 2018 2:36 PM

Four drowned in seperate incidents in krishna and guntur - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని నున్న, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం ఉదయం విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. నున్నలో జరిగిన దుర్ఘటనలో కార్తీక దీపాలను వెలిగించేందుకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు మంగళాపురం కాలువలో పడిపోయారు. స్థానికులు తల్లిని రక్షించగా.. కూతురు శ్వేత నీటిలో కొట్టుకుపోయింది.

కృష్ణా నదిలో కార్తీక స్నానాలకు వెళ్లిన అత్తా, కోడళ్లు గల్లంతయ్యారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో అత్తా కోడళ్లైన బ్రాహ్మణి, అన్నపూర్ణలు స్నానాలు చేసేందుకు కృష్ణా నదికి వెళ్లారు. అయితే.. ప్రమాదవశాత్తూ వారు నదిలో గల్లంతు కాగా వీరిలో అత‍్త మృతదేహం లభ్యమైంది. గల్లంతైన బ్రాహ్మణి కోసం గాలింపు చర్యలు కొనసాగుతు​న్నాయి. కాగా... వారం రోజుల క్రితం కృష్ణా నదిలో బోటు బోల్తా పడి 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement