మెడ్‌టెక్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అరెస్టు | Former Vice President of Med Tech arrested | Sakshi
Sakshi News home page

మెడ్‌టెక్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అరెస్టు

Aug 7 2017 2:40 AM | Updated on Sep 17 2017 5:14 PM

మెడ్‌టెక్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అరెస్టు

మెడ్‌టెక్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అరెస్టు

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ పార్కు (మెడ్‌టెక్‌)కు చెందిన అధికారిక సమాచారాన్ని ఇతరులకు చేరవేసి సైబర్‌ నేరానికి పాల్పడ్డాడన్న అభియోగం

సంస్థను మోసగించాడని జుడిష్‌ రాజ్‌పై సీఈవో ఫిర్యాదు 
 
మధురవాడ(భీమిలి)/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ పార్కు (మెడ్‌టెక్‌)కు చెందిన  అధికారిక సమాచారాన్ని ఇతరులకు చేరవేసి సైబర్‌ నేరానికి పాల్పడ్డాడన్న అభియోగంపై ఆ సంస్థ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జుడిష్‌ రాజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెడ్‌టెక్‌ సంస్థలో పనిచేసిన జుడిష్‌ రాజ్‌ కీలక సమాచారాన్ని అనధికారికంగా తప్పుడు మొయిళ్ల ద్వారా ఇతరులకు, ఇతర రాష్ట్రాలకు చేరవేశాడు. సంస్థను మోసం చేసి నష్టం కలిగించాడు. ఈ మేరకు మెడ్‌టెక్‌ పార్క్‌ సీఈవో జితేంద్రశర్మ పేరిట ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు అందింది.

రాజ్‌ ప్రవర్తన నచ్చక గత ఏప్రిల్‌లో కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కేరళకు చెందిన జుడిష్‌ రాజ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సైబర్‌ నేరం, సెక్షన్‌ 420 కింద అతడిని శనివారమే హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన జుడిష్‌ రాజ్‌తోపాటు మరికొందరు మెడ్‌టెక్‌ జోన్‌లో జరిగిన అవినీతిపై మాట్లాడగానే ఆయనను అరెస్టు చేయడం, మరికొందరిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

అవినీతి వెనుక కొందరు ఏపీ మంత్రులతోపాటు ఓ కేంద్ర మంత్రి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లన్నీ జుడిష్‌ రాజ్‌కు తెలుసు. ఈ పేర్లను బయట పెడతాడనే భయంతో అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. కాగా, మెడ్‌టెక్‌ పార్క్‌లో అక్రమాలపై ఆధారాలతో సీఎస్‌తో పాటు విజిలెన్స్‌ అధికారి అనూరాధకు ఫిర్యాదులు వెళ్లాయి. సీఎస్‌ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement