మాజీ ఎమ్మెల్యే దేముడు కన్నుమూత | former MLA demudu died | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే దేముడు కన్నుమూత

Oct 26 2015 8:08 AM | Updated on Sep 28 2018 3:41 PM

విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధ వ్యాధితో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

దేముడు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కన్నుమూశారు. సీపీఐ తరఫున ఆయన చింతపల్లి నియోజకవర్గం నుంచి 1994, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దేముడు అంత్యక్రియలు మండలంలోని శరబన్నపాలెంలో జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement