విజయనగరం వ్యవసాయం: జిల్లాపై కరువుమేఘాలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలో ఆందోళన మొదలైంది. నారుపోసి 60 రోజులువుతున్నా ఇంతవరకు నాట్లు పడకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నారు ఎండిపోవ డంతో మళ్లీ విత్తనాలను వేస్తున్నారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ప్రకృతి, ప్రభుత్వం కరుణించకపోవడంతో రైతులు అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. రుణమాఫీ చేస్తామన్న సర్కార్ ఇంతవరకు మాఫీ చేయలేదు. కొత్త రుణాలు కూడా అందలేదు.
ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి మదుపులు పెట్టారు. అయితే సరైన వర్షాలు కురవకపోవడంతో చాలా ప్రాంతాల్లో నారు ఎండిపోయింది. మడిలో తడికోసం కన్నుల నిండా నీళ్లు నింపుకొని ఎదురుచూస్తున్నాడు. విజయనగరం డివిజన్లో ఉన్న 19 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నారు ఎండిపోవడంతో విత్తనాలకోసం రైతులు వ్యవసాయధికారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు నాట్లు వేయడం పూర్తికాగా, ఈఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికి 50 శాతం నాట్లు కూడా పడలేదు. విజయనగరం డివిజన్ కన్నా, పార్వతీపురం డివిజన్ కొంత మేర అదనంగా నాట్లు పడ్డాయి.
తగ్గిన సాగు విస్తీర్ణం
జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 1,16,536 హెక్టార్లుకాగా, ఇంతవరకు 38,836హెక్టార్లులో నాట్లు వేశారు. వేరుశెనగపంటది అదే పరిస్థితి. 17,512 హెక్టార్లకుగాను 4798 హెక్టార్లలో, గోగు 14,618 హెక్టార్లకుగాను 2787హెక్టార్లలో మాత్రమే వేశారు. జొన్న 431 హెక్టార్లకుగాను 13హెక్టార్లు, సామ 527హెక్టార్లకుగాను 19 హెక్టార్లలో వేశారు. కొర్ర 262 హెక్టార్లకుగాను 16 హెక్టార్లు, మినుము1,554 హెక్టార్లకుగాను 193హెక్టార్లు , పెసర 1,405హెక్టార్లకు గాను 302 హెక్టార్లు, శెనగ 1,885 హెక్టార్లకు గాను 261హెక్టార్లలో మాత్రమే వేశారు. ఇక పొగాకు, చిరుధాన్యాల పరిస్థితి మరీ ఘోరం. పొగాకు 197 హెక్టార్లకు గాను ఒక్క హెక్టారులో కూడా సాగవలేదు. చిరుధాన్యానాలు 962 హెక్టార్లకుగాను ఒక హెక్టారులో కూడా వేయలేదు.
అన్నదాతపై అదనపు భారం
నీరు లేక గతంలో వేసిన వరినారు ముదిరిపోవడంతో రైతులు మళ్లీ నారువేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి నారు వేసిన 22 రోజులు తర్వాత నాట్లు వేయాలి. దీని వల్ల పంట అనుకున్న స్థాయిలో దిగుబడి వస్తుంది. తెగుళ్లు కూడా ఆశించవు. అయితే వర్షాలు కినుకు వహించడంతో నారు ముదిరిపోయింది. ముదిరిన నారు వేయడం వల్ల దిగుబడి సగానికి తగ్గిపోవడంతోపాటు తెగుళ్లు అధికంగా సోకే ప్రమాదం ఉంది. దీంతో ఎండిపోయిన నారును విడిచిపెట్టి కొత్తగా నారు వేసేందుకు రైతులుమళ్లీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది.
10 శాతం కూడా
పడని నాట్లు
జిల్లాలో మెరకముడిదాం, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, గరివిడి,చీపురుపల్లి,బొండపల్లి, ఎస్.కోట,వేపాడ,ఎల్.కోట, జామి, విజయనగరం,పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, కొత్తవలస, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో 10 శాతం కూడా నాట్లు పడలేదు.
నాపేరు అల్లి మల్లు నాయుడు. మాది నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామం. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. దీనికోసం 1001 రకం విత్తనాలను రెండు నెలల క్రితం మూడు ప్యాకెట్లు వేశాను. వర్షాలు పడకపోవడం వల్ల నారు ఎండిపోయింది. ఇప్పుడు మళ్లీ తేలికపాటి రకాలైన నెల్లురు సన్నాలు విత్తనాలు కొనుగోలు చేయడంకోసం వచ్చాను. గతంలో మూడు ప్యాకెట్లుకు రూ.1800 పెట్టాను. అది బూడిదలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్లీ విత్తనాలకు రూ. 1200 అయింది.
నాపేరు కాకి సూరమ్మ. మాదా నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామం నాకు ఎకరం పొలం ఉంది. ప్యాకెట్టున్నర 1001 విత్తనాలు వేశాను. వర్షాలు పడకపోవడం వల్ల ఎండిపోయింది. అప్పుడు రూ.900 పెట్టాను. ఇప్పుడు మళ్లీ రూ.600 పెట్టి విత్తనాలు కొనుగోలు చేసాను. నాలాంటి పేదరైతుకు ఇది అదనపు భారం.
కమ్ముకొస్తున్న కరువు!
Published Sun, Aug 17 2014 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement