రుణమాఫీ కాలేదన్న దిగులుతో రైతు గుండె ఆగింది. అనంతపురం జిల్లా ఇప్పేరుకు చెందిన రైతు గోపాల్(50)కు ఐదెకరాల పొలముంది.
కూడేరు: రుణమాఫీ కాలేదన్న దిగులుతో రైతు గుండె ఆగింది. అనంతపురం జిల్లా ఇప్పేరుకు చెందిన రైతు గోపాల్(50)కు ఐదెకరాల పొలముంది. సొసైటీ బ్యాంక్లో రూ.35 వేలు, స్టేట్బ్యాంక్లో బంగారం తాకట్టుపెట్టి రూ. 75 వేలు తీసుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు.
పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉండడంతో మాఫీ వర్తించలేదు. పేరు మార్పు కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో రుణమాఫీ వర్తించదన్న మనోవేదనతో సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.