అన్ని డిపోలకూ ఈ-పోస్ | E -pass in all Depots | Sakshi
Sakshi News home page

అన్ని డిపోలకూ ఈ-పోస్

May 22 2015 1:46 AM | Updated on Sep 3 2017 2:27 AM

ప్రస్తుతం ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు దెందులూరు మండలంలోని రేషన్ డిపోల్లో మాత్రమే

 ఏలూరు (టూ టౌన్) : ప్రస్తుతం ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు దెందులూరు మండలంలోని రేషన్ డిపోల్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ-పోస్ విధానం జూన్ 1నుంచి అన్నిచోట్లా అమల్లోకి రానుంది. ఇందుకోసం జిల్లాకు మరో 1,514 ఈ-పోస్ మెషిన్లు కేటాయించారు. వారం రోజుల్లో ఇవి జిల్లాకు చేరతాయని డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. వీటిని జిల్లాలోని అన్ని రేషన్ డిపోల్లో అమర్చి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామన్నారు. అనంతరం అన్నిచోట్లా ఈ-పోస్ విధానంలోనే రేషన్ సరుకులు పంపిణీ అవుతాయన్నారు. ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్న 616 రేషన్ డిపోల డీలర్లకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. శిక్షణకు హాజరుకాని డీలర్ల వివరాలు ఇవ్వాల్సిందిగా తహసిల్దార్లకు, సివిల్ సప్లైస్ డీటీలకు సూచించామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement