డీసెట్‌ గడువు పెంపు | Deadline Increase To DEECET | Sakshi
Sakshi News home page

డీసెట్‌ గడువు పెంపు

Apr 12 2018 9:56 AM | Updated on Aug 30 2019 8:37 PM

Deadline Increase To DEECET - Sakshi

మంత్రి గంటా శ్రీనివాస రావు(పాత చిత్రం)

అమరావతి : డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీసెట్‌) గడువు ఈ నెల 24 వరకు పెంచుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజానికి డీసెట్‌ దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసిందని, కానీ విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవ‌త్సర ప‌రీక్షా ఫ‌లితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీసెట్‌ పరీక్ష గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ డీసెట్‌కు అందిన దరఖాస్తులు 31,610.  ఆన్‌లైన్‌లో ఈ నెల సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement