మిత్రుడి కోసం ఆవుల మూగ వేదన | Cows Make Tribute To Their Friend Is So Sad Incident In Asifabad | Sakshi
Sakshi News home page

మిత్రుడి కోసం ఆవుల మూగ వేదన

Aug 15 2019 8:49 AM | Updated on Aug 15 2019 8:49 AM

Cows Make Tribute To Their Friend Is So Sad Incident In Asifabad - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ :  తమ ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనుషులే కాదు. మూగ జంతువులు సైతం బాధతో విలపిస్తాయి. బుధవారం కుమురం భీం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఓ ఆవు అనారోగ్య కారణంతో మృతి చెందింది. మరణించిన ఆవును గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్‌ వెనక వైపు తాడుతో కట్టి పట్టణ శివారువైపు తీసుకెళ్తుండగా తోటి పశువులు చూసి తమ ఆత్మీయురాలిని కోల్పోతున్నామనే బాధతో ఆ ట్రాక్టర్‌ను అరుస్తు వెంబడించసాగాయి. సబ్‌ జైలు సమీపం నుంచి ఆదిలాబాద్‌ చౌరస్తా వరకు ఆ ట్రాక్టర్‌ వెనకలే దాదాపు రెండు కిలోమీటర్ల మేర పరిగెడుతూ తమ మూగ బాధను వెల్లబుచ్చాయి.   


మృతి చెందిన ఆవును బాధతో వెంబడిస్తున్న తోటి ఆవులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement