అనంతపురం క్రైం, న్యూస్లైన్: నకిలీ నోట్లు చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.10 లక్షలకు పైగా నకిలీ నోట్లు, వాటి తయారీకి వినియోగించిన యంత్రాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు డీఎస్పీ నాగరాజ తెలి పారు. సోమవారం స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం పట్టణానికి చెందిన వీరయ్య అక్షయ గోల్డ్ ఏజెంట్గా పలువురితో ఆ సంస్థలో డిపాజిట్లు చేయించాడు.
ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో డిపాజిట్దారులు డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో తనను సమ స్య నుంచి గట్టెక్కించే మార్గం చూపాలం టూ అతను హిందూపురానికి చెందిన తాహిద్ను కోరాడు. ఇదే అదనుగా భావించిన అతను అనంతపురంలోని రాణీ నగర్కు చెందిన తన మిత్రుడు మగ్బూల్ అనే వ్యక్తి నకిలీ నోట్లు తయా రు చేస్తాడని, అతనిని కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించాడు.
దీంతో ఇద్దరూ కలసి మగ్బూల్ను కలువగా రూ.లక్ష నగదు ఇస్తే రూ.30 లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తానని చెప్పాడు. అతను సూచించిన మొత్తాన్ని వీరయ్య చెల్లించడంతో, ఆ డబ్బుతో కలర్ జెరాక్స్ మెషీన్, ప్రింటర్ తదితర పరికరాలు కొనుగోలు చేశాడు. నగరంలోని వేణుగోపాల్ నగర్లోని ఓ ఇంట్లో భార్య ముం తాజ్ సాయంతో నోట్ల తయారీ ప్రారంభించాడు. రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లను వీరయ్యకు అందజేశాడు. తానూ కొన్ని నోట్లను చలామణి చేసేందుకు సోమవారం సాయంత్రం తాడిపత్రి బస్టాండు సమీపంలో తాహీద్తో కలసి ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
నకిలీ కరెన్సీ తయారీలో శిక్షణ పొందిన మగ్బూల్
గుత్తికి చెందిన మస్తాన్ కూతురు ముంతాజ్ను మగ్బూల్ వివాహం చేసుకున్నాడు. మస్తాన్ నకిలీ కరెన్సీ తయారీలో సిద్ధహస్తుడు. అతని వద్దే మగ్బూల్ శిక్షణ పొందాడు. అలా నేర్చుకున్న విద్యతో గతంలోనకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తూ ధర్మవరం, హిందూపురం పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా, ప్రస్తుతం మగ్బూల్, తాహిద్లు పోలీసులకు పట్టుబడగా, వీరయ్య, మగ్బూల్ భార్య ముంతాజ్లుపరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది రమేష్, నాగరాజ తదితరులను అభినందించారు.
నకిలీ నోట్ల ముఠా ఆటకట్టు
Published Tue, Apr 1 2014 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
హోం ఓటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆదివారం రాహుల్ గాంధీ..
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం....
రాహుల్గాంధీ సభను విజయవంతం చేయండి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
సై.. అంటే సై!
మహిళలే నిరే్ణతలు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement