పత్తి లారీ దగ్ధం | cotton lorry burnt in krishna district | Sakshi
Sakshi News home page

పత్తి లారీ దగ్ధం

Apr 22 2015 9:08 AM | Updated on Sep 3 2017 12:41 AM

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న ఓ లారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది.

హనుమాన్‌జంక్షన్: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న ఓ లారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఎడ్లపాడు నుంచి ఓ లారీ పత్తిలోడుతో బయల్దేరింది. ఈ లారీ కృష్ణా జిల్లా బాపులపాడు పరిధిలోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ కంపెనీకి వెళ్లాల్సి ఉంది.


అయితే, లారీ డ్రైవర్‌కు రూట్ తెలియకపోవడంతో మధ్యలో సబ్‌రోడ్డులోకి వెళ్లి తిరిగి జాతీయ రహదారికి మళ్లాడు. ఈ కమ్రంలో ఎక్కడో లారీపైనున్న పత్తికి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు అంటుకున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురాగా, లారీపైనున్న పత్తిమాత్రం పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5.60 లక్షల నష్టం వాటిల్లినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement