ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు | Yellow Media Over Action With Polavaram Files Were Burnt, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

ఫైల్స్‌ దగ్ధమంటూ ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు

Aug 17 2024 5:53 PM | Updated on Aug 17 2024 6:10 PM

Yellow Media Over Action With Polavaram Files Were Burnt

తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యాలయం వద్ద ఫైల్స్‌ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్‌ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో  ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.

‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్‌ అండ్‌ ఆర్‌ స్పెషల్‌ కలెక్టర్‌ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్‌ కాదని ఆర్డీవో కేఎన్‌ జ్యోతి అంటున్నారు. 

‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్‌ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.

అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్‌ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్‌ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్‌ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్‌కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్‌సీపీ హయాంలోని ఫైల్సే  తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ  స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement