సమాజంలో అవినీతి పెచ్చరిల్లింది: జస్టిస్ నాగార్జునరెడ్డి | Corruption grew in the society: Justice Nagarjuna Reddy | Sakshi
Sakshi News home page

సమాజంలో అవినీతి పెచ్చరిల్లింది: జస్టిస్ నాగార్జునరెడ్డి

Aug 18 2013 1:51 AM | Updated on Sep 22 2018 8:22 PM

సమాజంలో అవినీతి అంతర్భాగంగా మారిపోయిందని హైకోర్టు న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులు నీతివంతంగా బతకడం నేర్చుకోవాలని ఉద్బోధించారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి
 పటాన్‌చెరు, న్యూస్‌లైన్: సమాజంలో అవినీతి అంతర్భాగంగా మారిపోయిందని హైకోర్టు న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులు నీతివంతంగా బతకడం నేర్చుకోవాలని ఉద్బోధించారు. అక్షయ పాత్ర సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. ఈ సంస్థ పరిధిలోని పాఠశాలలకు హైదరాబాద్ ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ సంస్థ సౌజన్యంతో శనివారం 190 కంప్యూటర్లను అందజేశారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా పటాన్‌చెరు అక్షయ పాత్ర కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ నాగార్జునరెడ్డి కంప్యూటర్లను జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement