'50 మంది ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలం' | Congress MLAs ready to vote for Bifurcation Bill, says Manikya Vara Prasad | Sakshi
Sakshi News home page

'50 మంది ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలం'

Jan 29 2014 4:24 PM | Updated on Sep 2 2017 3:09 AM

'50 మంది ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలం'

'50 మంది ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలం'

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా అందరికీ నిజనిర్ధారణ పరీక్షలు చేస్తే ఎవరు సమైక్యవాదులో తెలుస్తుందని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా అందరికీ నిజనిర్ధారణ పరీక్షలు చేస్తే ఎవరు సమైక్యవాదులో తెలుస్తుందని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే 50 మంది సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఓటేస్తారని చెప్పారు. లేకపోతే మంత్రి బాలరాజు, తాను మాత్రమే తెలంగాణకు అనుకూలంగా మిగులుతామని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజనకు తాను అనుకూలమని అసెంబ్లీలో మంత్రి బాలరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజన విషయంలో తమ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. దీంతో సమైక్యవాదులు ఆయనపై మండిపడ్డారు. ఇప్పుడు మాణిక్య వరప్రసాద్ కూడా తెలం‘గాణం’ అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement