గూప్‌వన్ అధికారుల అభినందనలు | Sakshi
Sakshi News home page

గూప్‌వన్ అధికారుల అభినందనలు

Published Wed, Feb 19 2014 2:23 AM

గూప్‌వన్ అధికారుల అభినందనలు - Sakshi

 గూప్‌వన్ అధికారుల అభినందనలు
 బాన్సువాడరూరల్, కోటగిరి, : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందటంతోమంగళవారం సాయంత్రం తెలంగాణ గ్రూప్‌వన్ అధికారులు తమ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌ను ఢిల్లీలో కలిశారు.
 
 వర్ని మండలం రుద్రూర్ గ్రామానికి చెందిన తెలంగాణ గ్రూప్‌వన్ అధికారుల అసోసియేషన్ చైర్మన్ మామిండ్ల అంజయ్య(ఆర్టీఓ) ఢిల్లీనుంచి ఫోన్‌లో మాట్లాడారు. ఇ న్నేళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమ రథసారథి కేసీఆర్‌కు తామంతా అభినందనలు తెలిపామన్నారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో తెలంగాణ గ్రూప్‌వన్ ఆఫీర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి దరావత్ హన్మంతునాయక్, ఉపాధ్యక్షుడు అంజన్‌రావ్, కార్యనిర్వాహక కార్యదర్శి హరికిషన్, తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement