పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా: సీతారాం ఏచూరి | Communist most strengthening, says sitaram yechury | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా: సీతారాం ఏచూరి

Apr 19 2015 1:41 PM | Updated on Aug 13 2018 9:04 PM

పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా: సీతారాం ఏచూరి - Sakshi

పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా: సీతారాం ఏచూరి

కమ్యూనిస్టుల బలోపేతానికి మరింత కృషి చేస్తానని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

విశాఖపట్నం : కమ్యూనిస్టుల బలోపేతానికి మరింత కృషి చేస్తానని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆదివారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పార్టీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై ఉంచి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. అలాగే మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థవంతంగా ఎత్తిచూపుతామని సీతారాం ఏచూరి తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement