నరసరావుపేట వెస్ట్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీతి మాలిన రాజకీయాలకు తెరతీశారని మాజీ మంత్రి, పీసీసీ క్రమ శిక్షణ సంఘం చైర్పర్సన్ కాసు వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు. తన గృహంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కాసు ప్రశ్నించారు. రాను రాను విలువలతో కూడిన రాజకీయాలు తెరమరుగు కావటం బాధగా ఉందన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ తగ్గిపోతున్నాయన్నారు. నరసరావుపేటలో అధికారులు, పాలకులకు ముందుచూపులేకపోవటం వల్లనే తాగునీటి ఇబ్బందులు వచ్చాయన్నారు.
రెండు, మూడు నెలలుగా తాను పరిస్థితిపై హెచ్చరిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. స్వచ్ఛ నరసరావుపేటకు తిలోదకాలు ఇచ్చారని, ఎక్కడ చూసినా కంపు కొడుతోందన్నారు. కోటప్పకొండ తిరునాళ్ల నాటికైనా పూర్తిస్థాయిలో తాగునీరు అందించాలని, లేకుంటే లక్షలాది మంది యాత్రికలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం వెన్నుపోటులతో కూడిందేనని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆశచూపించి తన పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబువి నీతిమాలిన రాజకీయాలు మాజీ మంత్రి కాసు
Published Fri, Feb 26 2016 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement