ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుంది. మూడు జోన్లుగా రాజధానిని ఏర్పాటుచేయడమే ఉత్తమమని, ఒకచోట మొత్తం అభివృద్ధిని కేంద్రీకరిస్తే సమస్యలు తప్పవని శివరామకృష్ణన్ కమిటీ తన తుది నివేదికలో చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. ఈ విషయమై చర్చించేందుకు మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ వాయిదా పడటంతో వెంటనే అందుబాటులో ఉన్న మంత్రులందరితో సమావేశం ఏర్పాటుచేసి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన తుది నివేదికలోని అంశాలపై వారితో చర్చించారు. ఎవరు పడితే వాళ్లు ఎలా పడితే అలా ప్రకటనలు చేయొద్దని క్లాసు పీకినట్లు సమాచారం. రాజధాని అంశంలో మంత్రులెవరూ భిన్ప ప్రకటనలు చేయొద్దని, కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే రాజధానిని ప్రకటిస్తామని ఆయన అన్నారు.
కేవలం అసెంబ్లీ, సచివాలయం, కొన్ని ప్రధాన కార్యాలయాలను మాత్రమే విజయవాడ- గుంటూరు మధ్య ఏర్పాటుచేసి, హైకోర్టు, ఇతర కార్యాలయాలను ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కేటాయించాలని కమిటీ నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు చంద్రబాబుకు గుబులు పట్టుకుంది. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు లాంటివాళ్లు ఇప్పటికే రాజధాని గురించి ప్రకటనలు చేయడం, విజయవాడ - గుంటూరు మధ్యనే వస్తుందని చెప్పడం, కమిటీ విషయాన్ని సీఎం, పీఎం చూసుకుంటారనడంతో ఇప్పుడు కక్కలేక, మింగలేక అన్నట్లు తయారైంది. చంద్రబాబుతో సహా మంత్రులంతా విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పారు. అయితే కమిటీ ఇందుకు విరుద్ధంగా చెప్పింది. ఇదే ఇప్పుడు వాళ్లందరినీ ఆలోచనలో పడేసింది.
చంద్రబాబుకు కమిటీ భయం
Published Thu, Aug 28 2014 11:01 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement