కారు బీభత్సం, నలుగురు దుర్మరణం | Car hits pedestrians, four killed, one injued in srikakulam district | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం, నలుగురు దుర్మరణం

Jun 20 2014 8:35 AM | Updated on Aug 30 2018 3:58 PM

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. లావేరు మండలం బుడుమూరు వద్ద ఈరోజు ఉదయం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పాదచారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement