ఇసుక ధర తగ్గించాలని ధర్నా | building construction aommity rally in ananthpur distirict | Sakshi
Sakshi News home page

ఇసుక ధర తగ్గించాలని ధర్నా

Feb 12 2015 11:24 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ సంఘం, పెయింటర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుంతకల్లులో గురువారం భారీ ధర్నా జరిగింది.

అనంతపురం: ఇసుక ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ సంఘం, పెయింటర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుంతకల్లులో గురువారం భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీరప్ప గుడి సర్కిల్ నుంచి గాంధీ చౌక్ వరకు దాదాపు మూడు కిలో మీటర్లు  ర్యాలీ నిర్వహించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. ధర్నాలో వైఎస్సార్ సీపీ నాయకులు వై.సుధాకర్, రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు ఉమారెడ్డి పాల్గొన్నారు.
(గుంతకల్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement