నా భూముల్లో మీ పెత్తనమేంటి? | BJP leader appala naidu quarlled with GMC officers on lands | Sakshi
Sakshi News home page

నా భూముల్లో మీ పెత్తనమేంటి?

Mar 12 2015 5:06 PM | Updated on Sep 2 2017 10:43 PM

తన భూముల్లో పనులు చేపడుతున్నారని జీవీఎమ్సీ అధికారులను బీజేపీ నేత అప్పలనాయుడు అడ్డుకున్నారు.

విశాఖ: విశాఖ జిల్లాలోని అనీట్స్ కాలనీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భూముల్లో పనులు చేపడుతున్నారని జీవీఎమ్సీ అధికారులను బీజేపీ నేత అప్పలనాయుడు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జీవీఎమ్సీ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  దాంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి అప్పలనాయుడును అడ్డుకున్నారు.

అనంతరం ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే జీవీఎమ్సీ పనులు చేపట్టిన భూములతో అప్పలనాయుడుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement