ఆర్టీసీ చార్జీల మోత | apsrtc bus charges increased | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చార్జీల మోత

Nov 5 2013 2:37 AM | Updated on Aug 20 2018 3:26 PM

ఆర్టీసీ చార్జీల మోత మోగింది. నష్టాల నుంచి గట్టెక్కే పేరుతో ప్రయాణికుడిపై ప్రభుత్వం గట్టిబాదుడే బాదింది.

 కంబాలచెరువు(రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఆర్టీసీ చార్జీల మోత మోగింది. నష్టాల నుంచి గట్టెక్కే పేరుతో ప్రయాణికుడిపై ప్రభుత్వం గట్టిబాదుడే బాదింది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 830 ఆర్టీసీ బస్సులు ప్రతి రోజూ సుమారు 3.50 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతూ, సుమారు 3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తాయి. తద్వారా రోజూ సుమారు రూ.80 లక్షల పైనే ఆదాయం సమకూరుతోంది. పెరిగిన చార్జీల వల్ల ప్రయాణికులపై మరింత భారం పడనుండగా, ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరనుంది.
 రాజమండ్రి నుంచి కొన్ని ప్రాంతాలకు పెరిగిన చార్జీల వివరాలు...
                                                    పాత చార్జీ      కొత్త చార్జీ
 రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్             రూ.50    రూ.55
 రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ డీలక్స్               రూ.55    రూ.61
 రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ సూపర్                లగ్జరీ  రూ.60    రూ.66
 రాజమండ్రి - హైదరాబాద్ సూపర్ లగ్జరీ                ర ూ.425   రూ.465
 కాకినాడ - హైదరాబాద్  సూపర్‌లగ్జరీ              రూ.471   రూ.512
 రాజమండ్రి - భద్రాచలం ఎక్స్‌ప్రెస్                       రూ.169   రూ.186
 రాజమండ్రి - విజయవాడ ఎక్స్‌ప్రెస్                రూ.121   రూ.132
 రాజమండ్రి - విశాఖపట్నం డీలక్స్                        రూ.179   రూ.198
 
 సామాన్యుడికి పెను భారమే
 ఆర్టీసీ చార్జీలు పెంచడం సామాన్యుడికి భారమే. ఎప్పుడెప్పుడు చార్జీలు పెంచాలా అనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వానికి సమైక్యాంధ్ర ఉద్యమం ఒక సాకులా తగిలింది. ఆ పేరుతో చార్జీలు పెంచి పేదవాడి ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సును వారికి దూరం చేస్తున్నారు.
 - ఎన్‌ఎన్‌ఎస్‌ఆర్‌పీఎస్ గుప్తా, రాజమండ్రి
 
 ప్రభుత్వంలో విలీనం చేయాలి
 ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆర్టీసీ చార్జీలను పెంచేసింది. ఇది చాలా దారుణం. దీనిని అందరం వ్యతిరేకిద్దాం. ఇలా పెంచుకుంటేపోతే చివరికి రైలు ఏసీ టిక్కెట్ చార్జీలకంటే ఆర్టీసీ బస్సు చార్జీలు అధికం అయినా ఆశ్యర్యపోనవసరంలేదు. దీనిని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాలి. పెంచిన చార్జీలను తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
 - రామకృష్ణ, ప్రయాణికుడు, రాజమండ్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement