ఫొని ఎఫెక్ట్‌ : కేంద్రానికి నివేదిక పంపిన ఎల్వీ | AP CS LV Subrahmanyam Sends Primary Report To Central Over Cyclone Fani | Sakshi
Sakshi News home page

ఫొని ఎఫెక్ట్‌ : కేంద్రానికి నివేదిక పంపిన ఎల్వీ

May 3 2019 4:29 PM | Updated on May 3 2019 4:35 PM

AP CS LV Subrahmanyam Sends Primary Report To Central Over Cyclone Fani - Sakshi

సాక్షి, అమరావతి : ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపారు. దీనిలో తుపాన్‌ ప్రభావం వల్ల 2 వేల విద్యుత్‌ స్థంభాలు, 117 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి 733 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తామని నివేదికలో పేర్కొన్నారు. 553 హెక్టార్లలో పంటలు.. 520 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఫొని తుపాన్‌ వలన ఎలాంటి ప్రాణ నష్టం సంభంవిచలేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement