
అంగన్వాడీ ఉద్యోగులకు భద్రత ఏదీ ?
అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఏదని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచుతా...
నగరి: అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఏదని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచుతాం, ఉ ద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన టీడీపీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందున చేయలేమని చెబుతోందన్నారు. మేనిఫెస్టో పెట్టేముందే రాష్ట్రం విడిపోతుం దన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలియదా ? అని ప్రశ్నిం చారు.
ప్రజలను మోసం చేయడానికే మేనిఫెస్టో తయారుచేశారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు అంగన్వాడీ ఉద్యోగులను గుర్రాలతో తొక్కించారని, ఎన్నికల్లో వారిని ఆకర్షించడానికే మేనిఫెస్టోలో ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ విషయం ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు.