జూలై 5న ఏపీ అగ్రిసెట్ | AGRICET 2015 on june 5th | Sakshi
Sakshi News home page

జూలై 5న ఏపీ అగ్రిసెట్

May 30 2015 9:07 AM | Updated on Sep 3 2017 2:57 AM

అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ అగ్రిసెట్-2015ను తిరుపతి ప్రధాన కేంద్రంగా నిర్వహించనున్నారు.

తిరుపతి:

గ్రికల్చర్ బీఎస్సీ కోర్సులో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ అగ్రిసెట్-2015ను తిరుపతి ప్రధాన కేంద్రంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అగ్రిసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ. గిరిదర్‌కృష్ణ తెలిపారు. అచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు అఖరి తేది జూన్ 18 గా నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ఏపీకి కేవలం 67 సీట్లు మాత్రమే ఉన్నాయని, వాటిలో61 సీట్లను అగ్రికల్చర్ పాలిటెక్నిక్, మరో ఆరు సీడ్ టెక్నాలజీకి కేటాయించామన్నారు. జూలై 5న అగ్రిసెట్ ప్రవేశ పరీక్షను తిరుపతి, గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement