గుప్తనిధుల కోసం తవ్వకాలు... | a gang tried to get Treasure | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు...

Feb 16 2015 8:44 PM | Updated on Sep 17 2018 8:02 PM

గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకాలు చేపడుతున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వైఎస్సార్ జిల్లా: గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకాలు చేపడుతున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సభ్యులు సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బుడ్డాయపల్లి గ్రామ చెరువులో గుప్త నిధులున్నాయనే నెపంతో కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. దీన్ని గమనించిన స్థానికులు తహశీల్దార్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ రవి చెరువులో అక్రమంగా గుంటలు తీస్తున్న ఇద్దరు వ్యక్తులతో సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement