50మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు | 50 Redwood smugglers arrested in Ysr District | Sakshi
Sakshi News home page

50మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Dec 28 2013 8:32 PM | Updated on Sep 2 2017 2:04 AM

జిల్లాలోని రాజంపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది.

వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని రాజంపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించడమే కాకుండా, అడ్డగించిన అటవీశాఖా అధికారులపై కూడా ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, పోలీసులతో సంయుక్తంగా  విస్తృత తనిఖీలు జరిపారు. ఈ జాయింట్ అపరేషన్లో భాగంగా అధికారులు రాజంపేట అటవీ ప్రాంతమంతా  జల్లడిపట్టారు. కాగా,  నిఘా పెట్టిన పోలీసులు, అధికారులు అడవిలో ప్రవేశిస్తున్న 50మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement