
రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి: పల్లె
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం..రాష్ట్రంలోని 15 వేల మంది టెన్త్, ఐటీ, పాలిటెక్నిక్ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ మెంట్ కు శిక్షణనిస్తారని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ మెంట్లో ఉచిత శిక్షణనిస్తామని ఆయన అన్నారు. రాబోయే కాలంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని భావిస్తున్నామని పల్లె తెలిపారు.