25 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

25 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Published Sun, Jul 5 2015 3:22 PM

25 ration rice bags cought in prakasham district

ప్రకాశం జిల్లా: అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గోదాం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోను స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement