తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా 189 కేసులు | 189 cases filed on cheating of cotton Weight machines | Sakshi
Sakshi News home page

తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా 189 కేసులు

Nov 23 2013 2:34 AM | Updated on Sep 2 2017 12:52 AM

పత్తి కొనుగోళ్ల సమయంలో తూకంలో మోసాలకు పాల్పడుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల కేంద్రాలపై రాష్ట్ర వ్యాప్తంగా 189 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: పత్తి కొనుగోళ్ల సమయంలో తూకంలో మోసాలకు పాల్పడుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల కేంద్రాలపై రాష్ట్ర వ్యాప్తంగా 189 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులతో తనిఖీలు నిర్వహించామని.. మోసాలకు పాల్పడిన మిల్లులలపై 189 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూనికల, కొలతల శాఖ సీల్ వేసిన యంత్రాలనే వాడాలని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement