126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీలు ఏకగ్రీవం

126 ZPTC and 2406 MPTCs are unanimous - Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారిక లెక్కలు విడుదల 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా వెల్లడించింది. ఇక 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,287 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉందని పేర్కొంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏకగ్రీవాలు పోను ఇక ఎన్నికలు జరగాల్సిన స్థానాలపై ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇచ్చింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top