భారీ ఇసుక డంప్ సీజ్ | Sakshi
Sakshi News home page

భారీ ఇసుక డంప్ సీజ్

Published Mon, Sep 7 2015 1:31 PM

100 lorrys sand seized in chittoor distirict

శాంతిపురం: చిత్తూరు జిల్లాలో భారీ ఇసుక డంప్‌ను రెవెన్యూ, పోలీసలు సంయుక్తంగా దాడి చేసి సీజ్ చేశారు. ఈ ఘటన జిల్లాలోని శాంతిపురం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని కొలమడుగు, తోపు చేను పరిసరప్రాంతాల్లో 100 ట్రాక్టర్ల ఇసుకను అనుమతులు లేకుండా నిల్వ చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో దాడి చేశారు. అనంతరం డంప్‌ను సీజ్ చేశారు. ఇసుక విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement