ఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో అక్రమాలపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే సేవామిత్ర యాప్ ద్వారా అధికార టీడీపీ పార్టీ నేతలు ఓట్లు తొలగించారని ఈసీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ అనుకూలురుకు పోస్టింగులు ఇస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీని కలిసినవారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఉన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు