వెంటనే చమురు ధరలు తగ్గించాలి
చమురు ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజల జేబులు కొడుతున్నాయని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల వలన కొనుగోలు శక్తి తగ్గిపోతుందన్నారు. రెపోరేటుపై ప్రభావం చూపితే బ్యాంకింగ్ రంగం కుదేలైపోతుందని తెలిపారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు