మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి..

భూవివాదం ఓ మహిళ ప్రాణం తీయగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి, దారుణంగా హతమార్చడమే కాకుండా, మరో వ్యక్తిపై రాడ్లతో దాడి తీవ్రంగా గాయపరిచిన ఘటన యాదమర్రి మండలం వరిగపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య విమలమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త జగన్నాధ రెడ్డి(65) తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top