నాకేం జరిగినా పరిటాల సునీతదే బాధ్యత | Thopudurthi Prakash Reddy criticised Paritala Sunitha for false cases | Sakshi
Sakshi News home page

నాకేం జరిగినా పరిటాల సునీతదే బాధ్యత

Feb 14 2018 1:52 PM | Updated on Mar 21 2024 7:46 PM

అనంతపురం జిల్లాలో మంత్రి పరిటా సునీత ఆదేశాలతోనే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. టీడీపీలో చేరకపోతే చంపుతామని తనను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరించారని దాడికి గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మంత్రి సునీత తనయుడు శ్రీరామ్ సమక్షంలోనే నాపై దాడి జరిగింది. కానీ నాతో బలవంతంగా టీడీపీ నేతలు సంతకాలు సేకరించారు. 

టీడీపీలో చేరకపోతే చంపుతామని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు ఏమీ అనలేదు. అదే సంతకంతో వైఎస్సార్‌సీపీ నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదుచేశారు. పరిటాల వర్గీయులు అరాచకాలు చేస్తుంటే రామగిరి సీఐ, ఎస్‌ఐ, ఇతర పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. మంత్రి సునీత నుంచి నాకు ప్రాణహాని ఉంది, దయచేసి రక్షణ కల్పించాలంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం విజ్ఞప్తి చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement