శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన | Tension At YSRCP Leader Kotam Reddy Sridhar Reddy Office | Sakshi
Sakshi News home page

శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన

Apr 15 2019 5:57 PM | Updated on Mar 22 2024 10:57 AM

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చించాలంటూ.. తిరుమలనాయుడి భార్య, తల్లి టీడీపీ కార్యకర్తలతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించారు. దాడిపై తాము కేసు నమోదు చేశామని నిందితులను గుర్తించామని పోలీసులు చెబుతున్నా టీడీపీ నేతలు వినలేదు. మరోవైపు అదే సమయంలో అక్కడకు భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేరుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement