కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. ఘటనా స్థలం భీతావహంగా ఉంది.
గాయపడిన వారు బస్సులో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా, శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
కరీంనగర్ జిల్లాలో లారీ-ఆర్టీసీ బస్సు ఢీ
May 29 2018 10:37 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement