పోలవరం ప్రాజెక్టు వద్ద అకస్మాత్తుగా నెర్రలుబాసిన రోడ్డు

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. రోడ్డంతా పెద్ద పెద్ద నెర్రెలు బాసింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి ఆ రోడ్డు గుండా రాకపోకలు నిలుపుదల చేశారు. భూ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోవడం వల్లనే రోడ్డు పైకి చొచ్చుకుని వచ్చిందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న పోలవరం డంపింగ్‌ కారణంగానే భూమి పైకి వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేశారు. రోడ్డు చెడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతానికి రవాణా ఇబ్బందులు తలెత్తాయి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top