పోలవరం కొత్త కాంట్రాక్టర్‌గా నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌

పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లో భారీ ట్విస్ట్‌ చేసుకుంది. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను ఈ సంస్థ చేపట్టనుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యాలయంలో మంగళవారం పోలవరంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులో స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్‌ ఛానల్‌ పనులను కొత్త గుత్తేదారుకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చింది. కాంట్రాక్టర్‌ మార్పు అంశాలపై చర్చించిన అనంతరం పాత ధరకే పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు రావడంతో కేంద్రం...కాంట్రాక్ట్‌ పనులను నవయుగకు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top