ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలా కాకుండా ఎమెర్జెన్సీ ముఖ్యమంత్రిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..అందరి హక్కులూ కేసీఆర్ హరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపద్ధర్మ సీఎంగా అసలు సీఎం కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని విమర్శలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం అని వ్యాక్యానించారు. ఇంతకు ముందు ఇలాంటి దుష్టాంతాలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు.
రేవంత్రెడ్డి అరెస్ట్ సరికాదు
Dec 4 2018 12:39 PM | Updated on Mar 20 2024 4:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement