మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌.. ఈసారి టార్గెట్‌ నాగా టెర్రర్‌! | Indian Army strikes on Naga militants | Sakshi
Sakshi News home page

మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌.. ఈసారి టార్గెట్‌ నాగా టెర్రర్‌!

Sep 27 2017 3:17 PM | Updated on Mar 20 2024 11:59 AM

భారత సైన్యం మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులపై విరుచుకుపడింది. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్‌ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 70మంది పారా కమాండోల బృందం ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు ఈ దాడి నిర్వహించింది. లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా టెర్రర్‌ క్యాంప్స్‌ను ధ్వంసంచేసింది. ఈ మెరుపుదాడుల్లో ఎన్‌ఎస్‌సీఎన్‌-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది. మన కమాండోలకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. జవాన్లపై నాగాలు దాడికి దిగడంతో.. వారిని నిలువరించే క్రమంలోనే మెరుపుదాడులు చేసినట్టు సైనికవర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement